ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పరిపాలనలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన సిఎం అయి నేటికి ఏడాది. ఈ ఏడాది కాలంలో ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందరికో ఉద్యోగాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాలు అన్ని కూడా ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. 

 

ఇక ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం  కుమార్తె పి సింధు ను  డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసారట. దీనికి సంబంధించి ప్రముఖ హాస్య నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: