ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాల కృష్ణ ట్విట్టర్ వేదికగా చేసే వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. జీవితం గురించి విలువల గురించి ఒక మనిషి ఏ విధంగా నిలబడాలి అనేది ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఒక పక్కన సినిమాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే ఏదోక విషయాన్ని చెప్తూ ఉంటారు ఆయన. 

 

తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు. ఒక సమస్య వచ్చినప్పుడు బాధ పడడం, స్పందించడం అని రెండు ప్రక్రియలు ఉంటాయి . బాధ పడుతూ కూర్చుంటే దేవుడుకూడా కాపాడలేడు. స్పందించడం మొదలు పెడితే మనను మనమే కాపాడుకోగలం.తెలిసి మసలుకోండి సన్నిహితులారా అంటూ పరుచూరి గోపాల కృష్ణ తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: