2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడింది. ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ పాలనలో తనదైన ముద్రవేస్తూ చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జనం నుంచి వచ్చిన నేతగా జనం  కష్టం తెలిసిన నేతగా... సరికొత్త అధ్యాయానికి తెర లేపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన పాలన పూర్తిగా ప్రజాహితం . ప్రజల సంక్షేమం కోసం ఏం చేయడానికైనా వెనకడుగు వేయలేదు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి... సంవత్సర కాలం పూర్తయిన నిన్నటి రోజు వరకు ప్రతి అడుగు ప్రజల కోసమే వేశారు... ప్రజాక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: