రైతు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుంది అని ఏపీ సిఎం వైఎస్  జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ మాట్లాడారు. మన ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అవుతుందని అన్నారు. ఇలాంటి సమయం రైతులతో గడపడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. 

 

రైతు భరోసా ద్వారా 10200 కోట్ల ను 49 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసామని అన్నారు. మనది రైతు పక్ష పాత ప్రభుత్వం అని చెప్పామని చేసి చూపించామని అన్నారు.  విత్తనం వేసిన దగ్గరి నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా ఉండటామని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని అన్నారు. రైతులకు అవసరం అయిన సమయంలో సహాయం అందలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: