ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం ఎంతో మంది ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల పాలన పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు వైసీపీ పార్టీకి చెందిన నేతలు అయితే జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపురూప పాలనకు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా... జగన్ పాలన పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు... వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ వైపు నడిచారు.. చరిత్ర సృష్టించారు... జగన్ మోహన్ రెడ్డి పాలన లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించింది... అదే సమయంలో రాష్ట్ర ప్రజల కలలను ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ జగన్ సర్కారు పాలనలో ముందుకు సాగుతుంది అంటూ మంత్రి పేర్ని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
One year ago @ysjagan walked towards the Chief Minister's chair, and the rest is history. andhra pradesh has witnessed tremendous growth, at the same time keeping the dreams & aspirations of people above all. #1YearForYSJaganAneNenu pic.twitter.com/ANLv5eQCu6
— perni nani (@perni_nani) May 30, 2020