దేశంలో కరోనా కేసులు ఫిబ్రవరి మాసంలో మొదలయ్యాయి.. అప్పటి నుంచి మెల్లి మెల్లిగా కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి. దాంతో మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ 4.0 లాక్ డౌన్ కొనసాగుతుంది.. కాకపోతే కేసుల ఉద్రితిని బట్టి లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని వ్యవస్థలు పనిచేసే విధంగా ఉన్నాయి.. కానీ కొన్ని చోట్ల మాత్రం కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో లాక్ డౌన్ సండలింపులు ఇచ్చే వీలు లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. లాక్డౌన్ ఎత్తేసిన మరుక్షణం హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లను తెరిచేందుకు జూన్ 1 నుంచే అనుమతి ఇస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
లాక్డౌన్ కొనసాగించే నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, థానే, పూణె, హైదరాబాద్, కోల్కతా, ఇండోర్, జైపూర్, జోధ్పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ ఒకటో తేదీ నుంచి హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, అది దశలవారీగానే ఉంటుందని సమాచారం. రేపు ప్రధాని ‘మన్ కీ బాత్’లో లాక్డౌన్ 5.0కి సంబంధించిన విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. దేశంలో మరో విడత లాక్డౌన్కు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కేసులు ఉద్ధృతంగా ఉన్న నగరాలు మినహా మిగతా చోట్ల లాక్డౌన్ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నగరాల్లో మరికొన్ని రోజులపాటు లాక్డౌన్ను కొనసాగించే అవకాశలున్నాయని చెబుతున్నారు.