ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు 3 కోట్ల 58 లక్షల మందికి సంక్షేమా కార్యక్రమాలను అందిస్తున్నామని జగన్ అన్నారు 49 లక్షల మందికి రైతు భరోసా అందించామని అన్నారు. నాడు నేడు ద్వారా ఎన్నో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. 

 

గ్రామ సచివాలయాల్లో లబ్ది దారుల జాబితా సిద్దంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఫించన్ లు టైం కి అందిస్తున్నట్టు చెప్పకొచ్చారు జగన్. లంచం లేనిదే గత ప్రభుత్వంలో ఏ ఒక్కటి జరిగేది కాదని అన్నారు. దరఖాస్తు నుంచి లబ్దిదారుల వరకు గ్రామ సచివాలయాల్లో ఉంటున్నాయి అని అన్నారు. మా ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటికి వెళ్ళే సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: