తనకు ఓటు వేయని వారి ముఖంలో చిరు నవ్వు చూడటమే తన లక్ష్యమని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. అర్హులు అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాయి అని ఓటు వేయని వారికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించామని జగన్ పేర్కొన్నారు. అర్హులు అందరికి కూడా భవిష్యత్తులో ప్రతీ ఒక్క కార్యక్రమం అందుతుందని అన్నారు. 

 

రైతులు తన పాలనలో ఇబ్బంది పడకూడదు అని జగన్ చెప్పుకొచ్చారు. ఇళ్ళ స్థలాలు అందరికి అందిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడమే తమ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని ఆయన వివరించారు. రైతులకు అండగా ఉండటానికే రైతు భరోసా కేంద్రాలు అని జగన్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: