నిన్న ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి ఆయననే ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలిందని నిన్నంతా వెబ్, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. తాజాగా జగన్ సర్కార్ నిన్నటినుంచి వార్తలు వస్తున్న విధంగానే సుప్రీంను ఆశ్రయించింది. 
 
జగన్ సర్కార్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీం ఈ పిటిషన్ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.  గతంలో రంగుల విషయంలో వైసీపీ సుప్రీంను ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం వైసీపీ సుప్రీంను ఆశ్రయించటంతో సుప్రీం ఎలాంటి తీర్పు చెబుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: