ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 70 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 2944కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,092 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 792 యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పటివరకు 60 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, విదేశాల నుంచి రాష్ట్రానికి చెందిన వారు రావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: