కృష్ణా జిల్లా కంచికచర్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి ఆత్మహత్య చేసుకున్నారు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. నీలవేణి భర్త కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది తెలియలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడి తో చేసుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. 

 

ఆమె భర్త కూడా విధుల్లో ఉండగా ఈ విషయం తెలియడం తో ఆయన ఆస్పత్రికి వచ్చారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: