ఒక  పక్కన కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దేశానికి ఇప్పుడు మిడతల దండు చుక్కలు చూపిస్తుంది. దాదాపు దక్షినాది రాష్ట్రాలతో పాటుగా మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మిడతలు ఎక్కడ ఉన్నాయి అంటే... 

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపురి జిల్లాలో మిడుతలు అధికంగా ఉన్నాయి. ఒక రైతు మాట్లాడుతూ "మిడుతలు మా పంటను నాశనం చేశాయి. పురుగుమందులు చల్లడం, డ్రమ్స్ మరియు పాత్రల సహాయంతో ధ్వనిని ఉత్పత్తి చేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాంతం నుండి ఈ సమూహం ఇప్పుడు దాటిందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: