దేశ ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబై లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి ముంబై లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. వేల కేసులు నమోదు కావడం తో ఇప్పుడు జనాలు బయటకు రావాలి అంటేనే భయపడే విధంగా ఉన్నాయి పరిస్థితులు అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే దేశంలోనే అతి పెద్ద మురికివాడ దారావి లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

ముంబైలోని దారావి ప్రాంతంలో ఈ రోజు 18 కొత్త పాజిటివ్ కేసులు & 1 మరణం నమోదైంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1733 కు చేరుకుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ఇప్పటి వరకు అక్కడ 71 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: