45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ ఇస్తామని చెప్పిన పెద్దమనిషి... ఏకంగా శాసనసభలోనే నేనలా అనలేదు అనడం ఎంత పెద్ద మోస౦ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేసారు. ఏడాదికాలంలో ఇలా రోజుకో మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. ఇకనైనా పాలకులు వెనుకటి బుద్ధులు మానుకోవాలని ఆయన సూచించారు.
రైతు భరోసా విషయానికే వస్తే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికీ రూ.12500లు ఇస్తానన్నారని... తర్వాత రూ. 6,500లే అన్నారని.. తెలుగుదేశం గట్టిగా అడిగితే ఇంకో వెయ్యి పెంచి రూ.7500లు చేసారని ఆయన పేర్కొన్నారు. ఇదొక మోసమన్న చంద్రబాబు... పోనీ అదైనా అందరికీ ఇచ్చారా అంటే సగం మంది రైతులకే ఇస్తున్నారు. ఎంత మోసం అని ప్రశ్నించారు.
.
వంద మాటలు చెప్పి అందులో ఒక్క అబద్దం ఆడితేనే ఆ వ్యక్తి మీద అబద్దాల కోరు అనే ముద్ర పడిపోతుందని... అలాంటిది వందకు వంద శాతం అబద్ధాలే మాట్లాడేవాళ్ళ సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. వైసీపీ పాలకులు ఆ కోవలోకే వస్తారన్నారు. అసలు మాట తప్పం- మడమ తిప్పం అనే మాటే ఒక పెద్ద అబద్ధమని ఆయన ఆరోపించారు.
రైతు భరోసా విషయానికే వస్తే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికీ రూ.12500లు ఇస్తానన్నారు. తర్వాత రూ. 6,500లే అన్నారు. తెలుగుదేశం గట్టిగా అడిగితే ఇంకో వెయ్యి పెంచి రూ.7500లు చేసారు. ఇదొక మోసం. పోనీ అదైనా అందరికీ ఇచ్చారా అంటే సగం మంది రైతులకే ఇస్తున్నారు. ఎంత మోసం!(2/3)#JaganCheatsAP
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 30, 2020
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ ఇస్తామని చెప్పిన పెద్దమనిషి... ఏకంగా శాసనసభలోనే నేనలా అనలేదు అనడం ఎంత పెద్ద మోసం! ఏడాదికాలంలో ఇలా రోజుకో మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇకనైనా పాలకులు వెనుకటి బుద్ధులు మానుకోవాలి. (3/3)#JaganCheatsAP
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 30, 2020