ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భారిన పడింది. మన దేశంలో మార్చి 24 నుంచి కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటున్నారు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు. ఇందులో క్రికెటర్లు, సినీ స్టార్లు ఇంటి వద్ద ఉంటూ రక రకాల వీడియోలు షేర్లు చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ టిక్ టాక్ వీడియోలో కొందరు గ్రామీణ ప్రాంతాల యువకులు క్రికెట్ ఆడుతూ, డీఆర్ఎస్ విధానాన్ని అనుకరిస్తూ ఓ స్కిట్ చేయడం చూడొచ్చు. క్రికెటర్లు మైదానంలో డీఆర్ఎస్ కు అప్పీల్ చేసినప్పుడు థర్డ్ అంపైర్ టెలివిజన్ రీప్లేలు ఎలా చూస్తాడో, ఈ పద్ధతిలోనే గ్రామీణ యువకులు తమదైన శైలిలో చేసి చూపించారు. ఈ సందర్బంగా అశ్విన్ కామెంట్స్ చేస్తూ.. వామ్మో ఇలాంటి వీడియో... నవ్వాపు కోలేకపోతున్నాను, పొట్ట చెక్కలయ్యేలా ఉంది" అంటూ స్పందించారు.
I can’t stop laughing!!! Lmao 😂 😂😂😂 pic.twitter.com/xO14GmKnNQ
— Ashwin (During Covid 19)🇮🇳 (@ashwinravi99) May 30, 2020