తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా రాష్ట్రంలో ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో నేడు కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నివశించే వారిలో 60 మంది కరోనా భారీన పడగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 9 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ఐదుగురు కరోనా భారీన పడ్డారు. 
 
ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,499కు చేరింది. రాష్ట్రంలో 1,412 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా 1,010 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈరోజు ఆరుగురు మృతి చెందటంతో మృతుల సంఖ్య 77కు చేరింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: