ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ మద్యం షాపుల్లో ఆర్టీసీ కండక్టర్లను సూపర్ వైజర్లుగా నియమించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారులు ఈ మేరకు పరిశీలనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కండక్టర్లను సూపర్ వైజర్లుగా నియమించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 
 
కరోనా విజృంభణ నేపథ్యంలో కండక్టర్లు లేకుండానే రాష్ట్రంలో బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులు ఆన్ లైన్ లేదా బస్టాపుల దగ్గర టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల అదనంగా ఉండే కండక్టర్లను డిప్యుటేషన్ పై బేవరేజెస్ కార్పొరేషన్ కు పంపితే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. అధికారులు త్వరలో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: