మహేష్ సినిమా టైటిల్ ఎప్పుడు చెప్తారు...? అసలు దర్శకుడు ఎవరు...? సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉందా...? ఎన్నో వార్తలు. ముగ్గురు దర్శకులతో చర్చలు జరిపి, నిర్మాతలు వేరే కథలు చెప్పి, మహేష్ స్వయంగా కథలు రెడీ చేయమని ఒకరికి చెప్పి అది కాదని చివరికి పరుశురాం కి అవకాశం వచ్చింది. 

 

సర్కారు వారి పాట  అనే టైటిల్ తో సినిమా చేస్తున్నట్టు తన తండ్రి పుట్టిన రోజు నాడు అయిన ఆదివారం మహేష్ ప్రకటించాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. దీనితో దర్శకుడు పరుశురాం ఆనందంతో పొంగిపోయే పరిస్థితి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అని ఇప్పటికి తన నిరీక్షణ ఫలించింది అని అతను చెప్పాడు. సెట్స్ లోకి వెళ్ళడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: