దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు ప్రతీ గంట కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత ఇదే విధంగా ఉంది అని చెప్పవచ్చు. 

 

గత 24 గంటల్లో దేశంలో తొలిసారి 8 వేల కేసుల మార్క్ దాటింది కరోనా. 8,380 కేసులు కొత్తవి నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. ఈ కేసులతో ఇండియా కొత్త రికార్డ్ ని నమోదు చేసింది. మొత్తం 1,82,143 కు చేరుకుంది. వీటిలో 89,995 క్రియాశీల కేసులు, 86,983 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: