గత వారం రోజులుగా తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, తెలుగుదేశంలోనే ఉంటాను అని స్పష్టం చేసారు. తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఏలూరి మండిపడ్డారు. ఆయన మార్టూరులో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేసారు. కాగా ఆయన మూడు రోజుల నుంచి వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ లో ఉన్న ఆయన నిన్న నియోజకవర్గానికి వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఉదయం అనుచరులతో సమావేశం నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: