రోగ నిరోధక శక్తి పెంచే సామర్ధ్యం యోగాలో ఉందని ప్రతీ ఒక్కరు యోగా చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కరోనాపై పోరులో యోగా ఉపయోగపడవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఉదయం మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
తాను చాలా మంది దేశాధినేతలతో మాట్లాడా అని వాళ్ళు ఆయుర్వేదం గురించి యోగా గురించి అడిగారు అని మోడీ అన్నారు. వలస కార్మికుల కోసం శ్రామిక్ రైళ్ళను నడుపుతున్నామని చెప్పారు. కరోనా శ్వాస వ్యవస్థను దెబ్బ తీస్తుందని యోగా నుంచి దీనిని మనం జయించవచ్చు అని మోడీ చెప్పుకొచ్చారు.
"Be it maintaining social distancing, wearing a mask or staying at home — we have to follow all these precautions without slightest laxity": PM Modi on #MannKiBaat pic.twitter.com/z9aZKzVETe
— NDTV (@ndtv) May 31, 2020