ఈరోజు నిర్మల్ జిల్లాలోని బాసర్ ట్రిపుల్ ఐటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏబీ-1 బ్లాక్ లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే భైంసా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంతో క్యాంపస్ మొత్తం పొగ కమ్మేసింది. ఏబీ-1 బ్లాక్ లోని ఫర్నీచర్, ప్రొజెక్టర్, కుర్చీలు, టేబుల్స్ అన్నీ కాలిపోయాయి. 
 
గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో రెండుసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెండు నెలల నుంచి స్విచ్ లు ఆఫ్ చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల విద్యార్థులు ఇళ్లకు పరిమితం కావడంతో పెను ప్రమాదం తప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: