ఒక పక్క భారత్ కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది  పడుతున్నా సరే చైనా నేపాల్ దేశాలు ఇప్పుడు సరిహద్దుల్లో భారత్ ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. చైనా ఇప్పటికే భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మొహరించి ఇబ్బంది పెట్టాలి అని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేపాల్ కూడా సరిహద్దుల్లో భారత్ ని ఇబ్బంది పెడుతుంది. 

 

తాజాగా నేపాల్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేపాల్ భారత్‌తో ఉన్న సంబంధాలను మరింత దిగజార్చే విధంగా ఒక అడుగు పడింది. నేపాల్ లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్, తన భూభాగంలో ఉన్న లింపియాధురా, లిపులేఖ్ మరియు కళాపానీల విషయంలో ఆ దేశ ప్రధానికి మద్దతు ప్రకటించింది. కొత్త పటానికి పార్లమెంటులో ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని నేపాలీ కాంగ్రెస్ శనివారం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: