విజయవాడ గ్యాంగ్ వార్ లో కొట్టుకుంది విద్యార్ధులు కాదు అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన కీలక విషయం బయటకు వచ్చింది. యనమలకుదురులో 2 కోట్ల స్థలానికి సంబంధించి జరిగిన గొడవలో రాజీ ప్రయత్నానికి వచ్చి దాడులు చేసుకున్నారు అని పోలీసులు గుర్తించారు. 

 

దీనికి సంబంధించిన కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒకే ల్యాండ్‌ వివాదంలో రెండు గ్రూపులు జోక్యంతో హత్యాయత్నం జరిగిందని గుర్తించారు. ఇరువర్గాల పరస్పర రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో రాజకీయ జోక్యం లేదని అధికారులు స్పష్టం చేసారు. దీనిపై ఇప్పుడు డీజీపీ గౌతం సవాంగ్ నివేదిక అడిగినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: