నేపాల్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడ రోజు రోజుకి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నా భవిష్యత్తులో కాస్త మారే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు. ఇక అక్కడ శనివారం 189 కొత్త కేసులు నమోదు కావడంతో... దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 1,400 కు చేరుకుంది.

 

శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో లాక్డౌన్ ని కొనసాగించాలి అని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలను జూన్ 30 వరకు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా అక్కడ విధించిన ప్రస్తుత లాక్ డౌన్ జూన్ 2 తో ముగుస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: