ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ మినహాయింపు లు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ని కేవలం కంటైన్మేంట్ జోన్ లకు మాత్రమే పరిమితం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం చెయ్యాలని కరోనా ప్రభావితం లేని ప్రాంతాల్లో పూర్తిగా సడలింపు లు ఇవ్వాలి అని భావిస్తున్నారు. 

 

జగన్ సర్కార్ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దేవాలయాల విషయంలో ముందు అడుగు వద్దు అని ఏపీ సర్కార్ భావిస్తుంది. కేంద్రం అనుమతులు ఇచ్చినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: