పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు దెబ్బకు దేశం మొత్తం కూడా భయపడుతుంది. రైతులు ఇప్పుడు అవి ఎక్కడ వస్తాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీ, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వీటి తో చాలా ఇబ్బంది పడ్డాయి. అయితే అక్కడి అధికారులు మాత్రం చాలా జాగ్రత్తగా వాటిని అంతం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మిడతలు బాగా ఎత్తులో చెట్లపై నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. 

 

దీనితో వాటిని డ్రోన్ ల ద్వారా చంపెసామని అక్కడి అధికారులు చెప్తున్నారు. జైపూర్‌లోని విరాట్‌నగర్ ప్రాంతంలో శనివారం భారీగా డ్రోన్లను వినియోగించి వాటిని అంతం చేసారు. కేంద్రం సహకారంతో తాము ఈ పని చేసామని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: