దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన సమయంలో కర్ణాటకలో చాలా తక్కువగా కేసులు నమోదు అయ్యాయి. అక్కడ చాలా వరకు కట్టడి చేసారు. కాని అనూహ్యంగా కరోనా కేసులు కర్ణాటకలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎన్ని చర్యలను తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం అక్కడ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. 

 

ప్రస్తుతం కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవడం లేదు. నేడు ఒక్క రోజే అక్కడ భారీ గా కేసులు బయటపడ్డాయి. కర్ణాటక మే 30 సాయంత్రం 5 నుండి మే 31 వరకు 299 కొత్త కరోన అకేసులు బయటపడ్డాయి. మొత్తం కేసుల సంఖ్య 3221 కు చేరుకుంది. 2 మరణాలు సంభవించాయి. దీనితో మరణించిన వారి సంఖ్య 51 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: