దాదాపు మూడు నెలల నుంచి ఆగిపోయిన రైలు సర్వీసులు రేపటి నుంచి క్రమంగా మొదలు కానున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ చాలా జాగ్రత్తగా రైలు సర్వీసులను మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. కరోన వ్యాప్తి అనేది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది రైల్వే శాఖ. ఇక రేపటి నుంచి దేశ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులు మొదలుకానున్నాయి. 

 

ఈ విషయాన్ని భారత రైల్వే శాఖ ప్రకటించింది. భారత రైల్వే జూన్ 1 నుండి 200 ప్యాసింజర్ రైలు సర్వీసుల కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చెప్పింది. 1 వ రోజు 1.45 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించనున్నారని పేర్కొంది. ఈ రోజు 09.00 గంటల వరకు మొత్తం 25,82,671 మంది టికెట్ లు బుక్ చేసుకున్నారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: