నిన్న ఉదయం విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ పై సిఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. విజయవాడ లో ప్రశాంత వాతావరణం ఉంది అని ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని... దీని వెనుక ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టవద్దు అని సిఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. 

 

ఇక డీజీపీ గౌతం సవాంగ్ తో కూడా ఆయన మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని  తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నిన్న జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా అకుడా సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ వార్ లో తోట సందీప్ అనే యువకుడు మరణించారు. అతను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్త అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: