దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ మాత్రం కూడా ఆగడం లేదు. దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పవచ్చు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

గత 24 గంటల్లో దేశంలో 8,782  కేసులు నమోదు అయ్యాయి. రికార్డ్ స్థాయిలో ప్రాణాలు కూడా పోయాయి. 223 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా... కేసుల సంఖ్య 190,609 కి చేరుకుంది. మొత్తం మరణాలు 5,408 గా ఉన్నాయి. 91,852 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఫ్రాన్స్ ని భారత్ దాటేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: