నిన్న విజయవాడ గ్యాంగ్ వార్ లో మరణించిన తోట సందీప్ అనే యువకుడి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. గ్యాంగ్ వార్ లో తీవ్రంగా గాయపడిన అతను నిన్న సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. దీనితో అతనికి పోస్ట్ మార్టం చేస్తుండగా... కాస్త పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఆస్పత్రి పరిసరాల్లో ఎవరిని రానీయకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేసారు. పోలీసులు కూడా భారీగా మొహరించారు. నడిచి వెళ్ళే వాళ్ళను అలాగే బైక్ ల మీద వెళ్ళే వాళ్ళను కూడా రానీయడం లేదు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి ఎవరు వచ్చినా సరే రానీయడం లేదు అధికారులు. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: