ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం ఈ నెల 5న జరగనుంది. ఈ కేబినేట్ సమావేశంలో లాక్ డౌన్ మినహాయింపులు, అలాగే లాక్ డౌన్ ని ఎక్కడ ఎక్కడ అమలు చెయ్యాలి అనే వాటిపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖరీఫ్ లో పంటల సాగు సహా సాగునీటిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేబినేట్ సమావేశంలో అంతరాష్ట్ర బస్ సర్వీసులపై కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. 

 

ఇప్పటికే అంతరాష్ట్ర రవాణా పై ఇప్పటికే కేంద్రం నిషేధం ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఏపీ సరిహద్దుల్లో ఉన్న తెలంగాణా  కూడా నిషేధం ఎత్తేసింది. ఈ సమావేశంలో సరిహద్దు రాష్ట్రాలకు బస్ సర్వీసుల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: