కృష్ణా జిల్లా పెనమలూరు మండలం లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఒక వాహన౦లో తరలిస్తున్న 290 కేజీల గంజాయి ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాని మీద ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఆ దొరికిన ఇద్దరూ కూడా యువకులే అని సమాచారం. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక జిల్లాలో మద్యం అక్రమ రవాణా కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. తెలంగాణా నుంచి జిల్లాకు ఎక్కువగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: