ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ పై బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ మేక తోలు కప్పుకున్నారని ఆ మేక తోలు ఏడాది లో తొలగిపోయిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు టూరిజం స్పాట్ గా వ్యవహరించారు అని ఇప్పుడు జగన్ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

సీఎం జగన్‌ అవగాహనారాహిత్యంతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ అసలు రంగు బయటపడిందని, అప్రజాస్వామ్యం, అవినీతి, అనుభవరాహిత్యం, కక్ష సాధింపులు, అసమర్థత, అప్పులే ప్రాధాన్యంగా జగన్‌ ఏడాది పాలన సాగిందని  ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో అవినీతిని తేల్చలేని అసమర్థత కనబడుతోందని  ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్‌ మూడు రాజధానుల చుట్టూ రాజకీయం చేస్తున్నారన్నారు కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: