ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. అందుబాటు లో ఉన్న కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశాలు ఉన్నాయి. ముందు కేంద్ర హోం  మంత్రి అమిత్ షా తో భేటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హైకోర్ట్ కొనసాగించాలి అని చెప్పడం అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ ఆయన తో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ తో కూడా జగన్ సమావేశం కానున్నారు. న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కూడా కలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: