ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కర స్థితిలో నమోదు అవుతున్నాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 105 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇప్పటి వరకు కరోనాతో 64 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 885 ఉండగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,169 గా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 28 మందికి కరోనా సోకింది. ఏపీలో ఉన్న వారికి 76 మందికి కరోనా సోకింది. దీనితో ఏపీలో కరోనా వచ్చిన వారి సంఖ్య 3,118 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: