విశాఖలో ఎవరు అయినా సరే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వదిలేది లేదని ఎంతటి వారు అయినా సరే ఊరుకునేది లేదని ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు అన్నారు. విశాఖలో సెంట్ భూమి కూడా కబ్జా చేయనీయకుండా ఆపుతామని గత ప్రభుత్వం చేసిన తప్పులపై సిట్ విచారణ జరుగుతుందని కన్నబాబు చెప్పుకొచ్చారు. 

 

విశాఖలో ప్రభుత్వ భూముల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భూములను కబ్జా చేసినట్టు తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్యే లేదని అన్నారు. అక్కడ అంగుళం భూమి కూడా కబ్జా కాలేదని అన్నారు. విశాఖకు గోదావరి జలాలను పైప్ లైన్ ద్వారా తాము తీసుకుని వెళ్తామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: