జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు ఏదోక షాక్ తగులుతూనే ఉంది. ప్రతీ రోజు కూడా ఉగ్రవాదులను లక్ష్యంగా చేస్తూ భారత ఆర్మీ కాల్పులు జరుపుతూ వస్తుంది. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యాకలాపాలు ఉండకూడదు అని భావిస్తున్న కేంద్రం ఇప్పటికే అక్కడ ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఉగ్రవాదులకు మరో షాక్ ఇచ్చాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లోని 10 గ్రెనేడ్లు, 4 వైర్‌లెస్ సెట్లు, 200 బుల్లెట్లతో ఉగ్రవాద సహచరుడిని కుప్వారా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరి కొందరి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. మరి కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: