శ్రీశైలం జలాశయం నుంచి బోటులో వెళ్లి వెలుగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన జలవనరుల శాఖా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 25వ తేదీ కల్లా వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ టన్నల్ పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్ట౦ చేసారు. ఈ సంవత్సరంలో ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీరందిస్తామన్న ఆయన... గత 5 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ కేవలం 4 కిలో మీటర్లే తవ్వారన్నారు.

 

తమ ప్రభుత్వంలో 4 నెలలో 3 కిలోమీటర్ల టన్నెల్ తోవ్వేశామని, నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డి పల్లి రిజర్వాయర్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని త్వరలోనే పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో మొదటి సంవత్సరం 90 శాతం హామీలు పూర్తి చేయడం జరిగిందని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: