తనకు సిఎం జగన్ తో ఎలాంటి విభేదాలు లేవని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం మీడియా తో మాట్లాడిన అయన కీలక వ్యాఖ్యలు చేసారు. తాను చనిపోయేవరకు సీఎం జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేసారు. తనను శంకించాల్సిన పనిలేదన్నారు. 

 

నాకు, మా అధ్యక్షుడు జగన్‌కి ఎలాంటి విభేదాలు లేవు..రావన్నారు. అదే విధంగా న్యాయవ్యవస్థని కించపరిచే ఉద్దేశంగానీ.. అగౌరవపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైసీపీ కార్యకర్తకు లేదన్నారు ఆయన. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డగోలుగా పెట్టిన పోస్టులకు..  కేసులు పెట్టి అరెస్ట్‌ చేసి ఉంటే ఎన్ని జైళ్లు అయినా సరిపోవన్నారు. తాము న్యాయవ్యవస్థను కించపరచడం లేదన్న ఆయన... హైకోర్టును గౌరవిస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: