గంగా దసరా నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. గంగా కేవలం నది కాదని ఆయన ట్వీట్ చేసారు. మేము దానిని మా తల్లిగా చూస్తామన్నారు ఆయన. ఈ సందర్భంగా గంగా నదికి హారతి ఇస్తున్న ఫోటో ని ఆయన ట్వీట్ లో చేసారు. అది మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తుందన్నారు ఆయన. 

 

ఇది నాగరికత యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు పవన్. ఇది మన కర్మ భూమిని సూచిస్తుందని ఆయన చెప్పారు. గంగా అంటే జీవితం, స్వచ్ఛత అన్నారు పవన్. ఈ  గంగా దసరాలో, మన నదులను కాపాడాలని నేను ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: