మార్చి 20నుంచి నిన్న మొన్నటి వరకు నేను ఏపీలో లేనని టీడీపీ  ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. పార్టీ మారుతున్నారు అని వచ్చిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సమయంలో నేను ఏపీలో ఉన్నట్లు గానీ లేదా బాలినేని ని కలిసినట్లు గానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అనగాని సవాల్ చేసారు. పార్టీ మార్పు పై ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. 

 

ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాక ఈ తరహా పుకారు మూడోసారన్నారు ఆయన. కరోనా లాక్డౌన్ సమయాన్ని మాపై దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బురద చల్లి ప్రతిసారీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోమనటం తగదని... చంద్రబాబు చేసే ప్రతి పోరాటంలో అండగా ఉంటున్నానని కొందరు కుట్రతో చేస్తున్నారన్నారు అని మండిపడ్డారు. మాలోనూ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: