డ్వాక్రా మహిళలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మోసం చేసారని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ ని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. చంద్రబాబుకి అధికారం పోయింది అనే బాధ ఎక్కువగా ఉందని మండిపడ్డారు. కుయుక్తలతో ఓడిపోయిన నెల రోజుల నుంచే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని సజ్జల ఆరోపించారు. 

 

సిఎం జగన్... చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పే వారు కాదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. చరిత్ర హీనుడిగా మిగిలినా చంద్రబాబు కుట్రలు మనాలేదని అన్నారు.  ప్రజా క్షేత్రంలో ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు లేపారని సజ్జల ఆరోపించారు. ప్రతీ ఒక్క దానిలో చంద్రబాబు కుట్రలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: