తెలంగాణాలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం షాపులకు సమయం పెంచుతూ ఆదేశాలు ఇచింది. ఇప్పటి వరకు లాక్ డౌన్ లో సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వైన్స్ ఓపెన్ లో ఉండేవి. దీనితో మద్యం అమ్మకాల విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో మరో రెండు గంటలు పెంచింది సమయం 

 

8 గంటల వరకు వైన్స్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పింది. కాగా లాక్ డౌన్ మినహాయింపులలో భాగంగా తెలంగాణా సర్కార్ పలు షాపులకు అనుమతులు ఇచ్చింది. అన్ని షాపులు 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచాలని చెప్పింది తెలంగాణా సర్కార్. ఇక రాత్రి సమయంలో కర్ఫ్యూ 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: