ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడిలో చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయం లో కరోనా కేసులు పెరగడం ఇప్పుడు కలవరపెట్టే అంశ౦. అక్కడ పని చేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

ఇక దానికి తోడు వారితో కలిసి పని చేసిన వారు కూడా వారితో చాలా సన్నిహితంగా ఉన్నారు. దీనితో ఎంత మందికి కరోన సోకింది అనేది అర్ధం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా క్వారంటైన్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఉద్యోగులు అందరికి కరోనా పరిక్షలు చెయ్యాలి అని ఏపీ సర్కార్ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: