తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగలేదు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల నుంచి దాదాపు వెయ్యి కేసుల వరకు నమోదు అవుతున్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా చెన్నై లో కరోనా ఆందోళనకర స్థాయిలో పెరగడం ఆందోళన కలిగించే అంశం. 

 

గత 24 గంటల్లో అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. 11 మరణాలు & 1162 కరోనా పాజిటివ్ కేసులు ఈ రోజు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,495 కు చేరుకుందని తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. చెన్నై లోనే దాదాపు వెయ్యి కేసుల వరకు నమోదు అయినట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ 984 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: