హైద‌రాబాద్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఎన్నో విషాదాల‌ను మిగుల్చుతోంది. ధూల్‌పేటలో వినాయక విగ్రహాలు తయారు చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పది రోజుల క్రితం తండ్రి(52)ని గుండెపోటు మృతి చెంద‌గా... సోమవారం తల్లి (45) కరోనాతో మృతి చెందింది. దీంతో వారి కుమారుడు(20), కూతురు(16) అనాథలయ్యారు.

 

అయితే.. 10 రోజుల క్రితం వ్యక్తి గుండెపోటుతో మృతి చెందగా, అతడి భార్య అస్వ‌స్థ‌త‌కు గురైంది. వెంట‌నే అధికారులు మహిళతో పాటు ఆమె పిల్లలను గాంధీ దవాఖానకు తరలించి కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: