భార‌త్‌లో కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన రోగుల సంఖ్య, ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇదే స‌మ‌యంలో రోగుల రికవరీ రేటు 50 శాతానికి చేరుకుంది. కాగా ఢిల్లీలో కరోనాతో బాధపడుతున్న 63 ఏళ్ల వృద్ధుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మృతుడు ఢిల్లీలోని మీఠాపూర్ నివాసి అని తెలుస్తోంది. విష‌యం తెలియ‌గానే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని వివ‌రాలు సేక‌రించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.

 

మీఠాపూర్‌లో నివసిస్తున్న ఒక వృద్ధుడిని డయాలసిస్ కోసం మే 20 న బాత్రా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో అతనికి కరోనా టెస్ట్ చేయ‌గా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో బాధితుడిని కొవిడ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా... చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: