ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ వెళ్ళగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటుగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా అయన కలవడానికి సిద్దమయ్యారు. అంతే కాకుండా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటి అయ్యే సూచనలు ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చిన జల వివాదాలను ఆయన చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఈ భేటి లో రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమీషనర్ గురించి కూడా చర్చించే సూచనలు ఉన్నాయి అని తెలుస్తుంది.